వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కమిటీ విధివిధానాల వెల్లడికి రోశయ్య బ్రేక్

By Pratap
|
Google Oneindia TeluguNews

Rosaiah
హైదరాబాద్: జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ విధివిధానాలను ఇప్పుడే వెల్లడించవద్దని ముఖ్యమంత్రి కె. రోశయ్య కాంగ్రెసు పార్టీ అధిష్టానాన్ని కోరినట్లు సమాచారం. శాసనసభలో బడ్జెట్ ను ప్రతిపాదించే వరకు విధివిధానాలను వెల్లడించవద్దని ఆయన విజ్ఞప్తి చేసినట్లు చెబుతున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీకి ఫోన్ చేసి ఆయన ఆ విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. అందువల్లనే కేంద్ర ప్రభుత్వం విధివిధానాల వెల్లడిలో జాప్యం చేస్తున్నట్లు సమాచారం. ఈ నెల 20వ తేదీన శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ను ప్రతిపాదించాలని నిర్ణయించింది.

బడ్జెట్ ప్రతిపాదించేవరకు శాసనసభ సజావుగా సాగితే చాలునని, ఆ తర్వాత సభ నడవకున్నా ఇబ్బంది ఉండదని ఆయన సూచించినట్లు సమాచారం. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ విధివిధానాలు వెల్లడిస్తే దానిపై వ్యతిరేకతతో ఏ ప్రాంతానికి చెందిన శాసనసభ్యులైనా శాసనసభ సమావేశాలను అడ్డుకునే అవకాశం ఉందని, అందువల్ల ఏదో విధంగా విధివిధానాల వెల్లడిని వాయిదా వేస్తూ రావడమే మంచిదని రోశయ్య భావనగా తెలుస్తోంది. అయితే, విధివిధానాలు వెల్లడించకపోతే శాసనసభ సమావేశాలను అడ్డుకుంటామని కాంగ్రెసు తెలంగాణ నాయకులు హెచ్చరిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X