అసెంబ్లీ సాగేందుకు సహకరించండి: రోశయ్య

దురదృష్టవశాత్తు అనుభవం గల వైయస్ రాజశేఖర రెడ్డి లేరని, అందువల్ల తాము అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. విమర్శలను సానుకూల దృక్పథంతో తీసుకోవాలని, తొందరపాటు సమాధానాలు కూడదని ఆయన అన్నారు. విద్యార్థులకు ఉపకార వేతనాలు అందడం లేదనే ఆరోపణలు వస్తున్నాయని, దాన్ని పరిశీలించాలని ఆయన అన్నారు. అధిక ధరలపై సమావేశంలో కీలక చర్చ జరిగే అవకాశం ఉందని, ఇందులో ప్రతిపక్షాల నుంచి వచ్చే విమర్శలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని ఆయన అన్నారు. వైయస్ సభను సమర్థంగా నడిపించేవారని, ఇప్పుడు కూడా అదే విధంగా నడిపించేలా చూడాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications