కెవిపికి మేం భయపడేది లేదు: సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డిని అడ్డం పెట్టుకుని కెవిపి రామచందర్ రావు అవినీతి కార్యక్రమాలకు పాల్పడి డబ్బులు లెక్కలేకుండా సంపాదించారని, ఇందులో అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. కెవిపి అక్రమాల వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాళా తీసే పరిస్థితి వచ్చిందని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీ అధిష్టానం ఇచ్చిన అలుసును ఆసరాగా చేసుకుని కెవిపి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. కెవిపి అవినీతి ఆరోపణలపై ముఖ్యమంత్రి కె. రోశయ్య ఎందుకు విచారణ జరిపించడం లేదని ఆయన అడిగారు. ఆంధ్ర శశికళ అని అన్నందుకు కెవిపి రామచందర్ రావు తమ నాయకుడు కోడెల శివప్రసాదరావుపై కోర్టుకు వెళ్లారని, తమపై ఎందుకు వెళ్లరని ఆయన అన్నారు. తమ పార్టీ నాయకులు ఇంకా కెవిపిపై కొత్త విషయాలు వెల్లడిస్తారని ఆయన అన్నారు. తాము చేసిన ఆరోపణలకు సమాధానం ఇవ్వకుండా కెవిపి తమ నేత చంద్రబాబుపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications