సీమాంధ్ర నేతలు ఊసరవెల్లులు: కెసిఆర్

K Chandrasekhar Rao
హైదరాబాద్: సీమాంధ్ర నేతలు రంగులు మార్చే ఊసరవెల్లులని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు విమర్సించారు. న్యాయవాదుల దీక్షా శిబిరంలో ఆయన గురువారం మాట్లాడారు. డిసెంబర్ 9వ తేదీన కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం ప్రకటన చేసే వరకు సీమాంధ్ర నేతలు తెలంగాణకు మద్దతిచ్చారని, ప్రకటన వెలువడగానే ఊసరవెల్లుల్లా రంగులు మార్చి వ్యతిరేకమయ్యారని ఆయన అన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమం కృత్రిమమైందని, ప్రజా ఉద్యమం కాదని, పిడికెడు మంది పెట్టుబడి దారులు దాన్ని నడిపిస్తున్నారని ఆయన అన్నారు.

న్యాయం చెప్పాల్సిన న్యాయవ్యవస్థలోనే తెలంగాణకు అన్యాయం జరిగిందని, మిగతా రంగాల సంగతి ఎంత అన్యాయం జరిగిందో దీన్ని బట్టి ఊహించుకోవచ్చునని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత తెలంగాణకు చెందిన ఒక్కరిని కూడా అడ్వకేట్ జనరల్ గా నియమించలేదని, ముఖ్యమంత్రి అనుకుంటే నియామకానికి ఒక్క రోజు చాలునని, తెలంగాణ జీవన్ రెడ్డి లాంటి ఉన్నతమైన న్యాయమూర్తులను అందించిందని, అయినా తెలంగాణకు న్యాయవ్యవస్థలో న్యాయం జరగలేదని ఆయన అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలోని సమస్యలు పరిష్కారమవుతాయని ఆయన అన్నారు.

శ్రీకృష్ణ కమిటీకి నివేదిక సమర్పించడానికి 90 రోజులకు మించి గడువు ఇవ్వరాదని, అలా ఇస్తే శాసనసభను నడవనివ్వబోమని ఆయన హెచ్చరించారు. శాసనసభ్యులు లేకుండానే బడ్జెట్ ను ఆమోదించుకుంటారా, ఆ విషయం తామూ చూస్తామని ఆయన అన్నారు. ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ చొరవ తీసుకుని తెలంగాణ ఎన్ని రోజుల్లో ఇస్తారో చెప్పాలని ఆయన కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+