చిదంబరంతో భేటీకి ఢిల్లీకి కేశవరావు

కేంద్ర హోం శాఖ సంప్రదింపుల కమిటీపై చర్చించేందుకు ఆయన ఢిల్లీ వెళ్లినట్లు భావిస్తున్నారు. ఆయన కేంద్ర హోం మంత్రి పి. చిదంబరంతో సమావేశమయ్యే అవకాశం ఉంది. శ్రీకృష్ణ కమిటీ విధివిధానాలపై, కాలపరిమితిపై కేశవరావు చిదంబరంతో మాట్లాడే అవకాశం ఉంది. కాలపరిమితి, విధివిధానాలు తెలంగాణకు అనుకూలంగా లేకపోతే శాసనసభకు హాజరు కాబోమని తెలంగాణ కాంగ్రెసు శాసనసభ్యులు హెచ్చరిస్తున్నారు.












Click it and Unblock the Notifications