వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబుతో జెసి దివాకర్ రెడ్డి సమావేశం

By Santaram
|
Google Oneindia TeluguNews

JC Diwakar Reddy
హైదరాబాద్‌: తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో మాజీ మంత్రి, అనంతపురం జిల్లా కాంగ్రెస్ నాయకుడు జేసీ దివాకర్‌ రెడ్డి గురువారం ఉదయం భేటీ అయ్యారు. అసెంబ్లీలోని బాబు ఛాంబర్‌లో వీరు సమావేశం అయ్యారు. సీమాంధ్ర, తెలంగాణ ఉద్యమాల నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. నేడు అనంతపురం జిల్లాల్లో సమైక్యాంధ్ర నినాదంతో లగడపాటి రాజగోపాల్ పర్యటిస్తున్నారు. ఈ పరిణామాన్ని చర్చించడానికే జెసి చంద్రబాబును కలుస్కున్నట్టు తెలుస్తోంది.

'సమైక్యాంధ్ర మా లక్ష్యం...తెలుగువారందరూ కలిసి ఉండాలనేది మా ఆశయం...రాష్ట్రం విడిపోకుండా కలిసి ఉండాలనేది మా ధ్యేయం...సమైక్యాంధ్ర సాధన కోసం ఎందాకైనా పోరాడతాం' అని సమైక్యాంధ్ర సంరక్షణ సమితి (జేఏసీ) రాష్ట్ర అధ్యక్షుడు నరహరిశెట్టి శ్రీహరి అన్నారు. విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ గురువారం జిల్లా పర్యటనకు వస్తున్నందున అందులో భాగంగా శ్రీహరి కూడా 'అనంత'కు వచ్చారు. ఉద్యమంలో న్యాయవాదులు కీలకపాత్ర పోషించాలని ఆయన పిలుపునిచ్చారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X