వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణకు అనుగుణంగానే కమిటీ: చిదంబరం

By Pratap
|
Google Oneindia TeluguNews

Chidambaram
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తామని తాను డిసెంబర్ 9వ తేదీన చేసిన ప్రకటనకు అనుగుణంగానే జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ పనిచేస్తుందని కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం హామీ ఇచ్చారు. రాజీనామాలు సమర్పించిన కాంగ్రెసు శాసనసభ్యులు ఆర్ దామోదర్ రెడ్డి, ముత్యంరెడ్డి, ప్రజారాజ్యం శాసనసభ్యుడు మహేశ్వర రెడ్డి శుక్రవారం చిదంబరాన్ని కలిశారు. ఈ భేటీలో తమకు చిదంబరం ఆ హామీ ఇచ్చినట్లు ఆ ముగ్గురు శాసనసభ్యులు మీడియా ప్రతినిధులతో చెప్పారు. డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ ఏర్పాటుకు అనుగుణంగా తాను చేసిన ప్రకటనకు అనుకూలంగానే తదుపరి ప్రకటనలు, సమావేశాలు జరిగాయనే, అందులో భాగంగానే శ్రీకృష్ణ కమిటీ వేశామని చిదంబరం చెప్పారు.

కనీసం 24 గంటలు తెలంగాణలో శాంతి నెలకొంటే విద్యార్థులపై కేసులు ఎత్తేస్తామని చిదంబరం చెప్పారని, అయితే కమిటీ విధివిధానాల్లో మార్పులు చేస్తే శాంతి నెలకొంటుందని తాము చెప్పామని, ఆ విషయాన్ని పరిశీలిస్తామని చిదంబరం చెప్పారని ఆ ముగ్గురు శాసనసభ్యులు వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని, డిసెంబర్ 9వ తేదీన తాను చేసిన ప్రకటనకు తాము కట్టుబడి ఉన్నామని, అందులో భాగంగానే శ్రీకృష్ణ కమిటీ వేశామని చిదంబరం తమతో వివరించినట్లు దామోదర్ రెడ్డి చెప్పారు. చిదంబరంతో భేటీ తమకు సంతృప్తినిచ్చిందని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X