విశాఖ వద్ద వైఎస్సార్, ఎన్టీఆర్ విగ్రహాల వివాదం
తొలుత ఎంపిక చేసిన స్థలం అనుకూలంగా లేకపోవడంతో సమీపంలో పెందుర్తి రోడ్డుకు ఆనుకుని ఉన్న జిల్లా పరిషత్ హైస్కూల్ వెనుక ఆవరణలో విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి రెండు రోజులక్రితం హైస్కూల్ ప్రహారీ గోడను తొలగించి దిమ్మను నిర్మించేపనులు చేపట్టారు. దీన్ని చూసిన 'దేశం" నాయకులు తాముకూడా ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామంటూ వైఎస్ విగ్రహం నెలకొల్పబోయే స్థలం పక్కనే అర్ధాంతరంగా బుధవారం నుంచి దిమ్మనిర్మాణం పనులు ప్రారంభించారు. టిడిపి నాయకుల ఆధ్వర్యంలో రాత్రి వరకూ పనులు జరిగాయి. దీన్ని చూసిన స్థానిక సర్పంచ్ రెడ్డి జగన్మోహన్ హెచ్ఎం అనుమతితోవిగ్రహనిర్మా ణానికి పనులు చేయిస్తున్నారా? హైస్కూల్ కమిటీ చైర్మన్నైన తనకు మాటమాత్రమైనా తెలియచేశారా? అని అడగ్గా తెలుగుయువత నాయకుడు పైల గోపి తదితర్లకు సర్పంచ్ మోహన్వర్గీయులకు మధ్య వాగ్వివాదం, ఘర్షణలు జరిగాయి.