వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విశాఖ వద్ద వైఎస్సార్, ఎన్టీఆర్ విగ్రహాల వివాదం

By Santaram
|
Google Oneindia TeluguNews

Vishakapatnam
విశాఖపట్నం: కె.కోటపాడులో దివంగత ముఖ్యమంత్రి డాక్టరు వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహస్థాపన రాజకీయవివాదానికి తెరలేపింది. హైస్కూల్‌ వెనుకన ఉన్న స్థలంలో విగ్రహాన్ని ఏర్పాటు చేయడమే వివాదానికి మూలమని తెలుస్తోంది. వైఎస్‌ విగ్రహం నెలకొల్పబోయే స్థలం పక్కనే ఎన్టీ ఆర్‌ విగ్రహాన్ని కూడా టిడిపి నాయకులు ఏర్పాటుకు అర్ధాంతరంగా పనులు ప్రారభించారు. దీంతో స్థానిక కాంగ్రెస్‌ నాయకులు టిడిపి నాయకులు మధ్య ఘర్షణలు జరిగాయి. దీంతో కె.కోటపాడులోని రాజకీయాలు ఉన్నట్టుండి వేడెక్కాయి. ఎవరినోట విన్నా విగ్రహాల ఏర్పాటులోచోటుచేసుకున్న రాజకీయాలపైనే చర్చలు. ఉత్తరాపల్లి మాజీ ఎమ్మెల్యే పూడి మంగపతిరావు ముందుగా ప్రకటించినట్టుగా ఈనెల 20న వైఎస్‌ విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు చేస్తున్నారు.

తొలుత ఎంపిక చేసిన స్థలం అనుకూలంగా లేకపోవడంతో సమీపంలో పెందుర్తి రోడ్డుకు ఆనుకుని ఉన్న జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ వెనుక ఆవరణలో విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి రెండు రోజులక్రితం హైస్కూల్‌ ప్రహారీ గోడను తొలగించి దిమ్మను నిర్మించేపనులు చేపట్టారు. దీన్ని చూసిన 'దేశం" నాయకులు తాముకూడా ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామంటూ వైఎస్‌ విగ్రహం నెలకొల్పబోయే స్థలం పక్కనే అర్ధాంతరంగా బుధవారం నుంచి దిమ్మనిర్మాణం పనులు ప్రారంభించారు. టిడిపి నాయకుల ఆధ్వర్యంలో రాత్రి వరకూ పనులు జరిగాయి. దీన్ని చూసిన స్థానిక సర్పంచ్‌ రెడ్డి జగన్‌మోహన్‌ హెచ్‌ఎం అనుమతితోవిగ్రహనిర్మా ణానికి పనులు చేయిస్తున్నారా? హైస్కూల్‌ కమిటీ చైర్మన్‌నైన తనకు మాటమాత్రమైనా తెలియచేశారా? అని అడగ్గా తెలుగుయువత నాయకుడు పైల గోపి తదితర్లకు సర్పంచ్‌ మోహన్‌వర్గీయులకు మధ్య వాగ్వివాదం, ఘర్షణలు జరిగాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X