వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జర్నలిస్టులపై కేసులు ఎత్తేస్తాం: సబిత

By Pratap
|
Google Oneindia TeluguNews

Sabitha Indra Reddy
హైదరాబాద్: జర్నలిస్టులపై కేసులు ఎత్తేయడానికి ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇటీవల ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జర్నలిస్టులపై భద్రతా బలగాలు దాడి చేశాయి. టీవీ చానెళ్ల ప్రతినిధుల కెమెరాలు, తదితర పరికరాలను ధ్వంసం చేశారు. ఈ దాడిలో కొంత మంది జర్నలిస్టులు గాయపడ్డారు కూడా. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు జర్నలిస్టులపై 21 కేసులు నమోదు చేశారు. ఈ కేసుల నమోదుకు నిరసనగా జర్నలిస్టులు శనివారం ముఖ్యమంత్రి కె. రోశయ్య బడ్జెట్ ప్రసంగాన్ని బహిష్కరించాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం ముఖ్యమంత్రి కె. రోశయ్య, హోం మంత్రి సబితా ఇంద్రా రెడ్డి జర్నలిస్టు సంఘాల నాయకులతో చర్చలు జరిపారు. ఈ చర్చల సందర్భంగా ఇరు పక్షాల మధ్య అంగీకారం కుదిరింది. దీంతో ముఖ్యమంత్రి బడ్జెట్ ప్రసంగాన్ని బహిష్కరించాలనే నిర్ణయాన్ని జర్నలిస్టులు ఉపసంహరించుకున్నారు.

జర్నలిస్టులపై కేసులను ఎత్తేయడమే కాకుండా ధ్వంసమైన జర్నలిస్టుల కెమెరాలకు, వాహనాలకు, ఇతర పరికరాలను నష్టపరిహారం చెల్లిస్తామని జర్నలిస్టు సంఘాల నాయకులతో చర్చల అనంతరం హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి మీడియా ప్రతినిధులతో చెప్పారు. జర్నలిస్టులపై దాడులకు బాధ్యులైన అధికారులపై కూడా చర్యలు తీసుకుంటామని హోమం మంత్రి చెప్పారు. సంఘటనపై విచారణ జరుగుతోందని, విచారణ అనంతరం దోషులపై చర్యలు తీసుకుంటామని ఆమె అన్నారు. జర్నలిస్టులపై కేసులకు నిరసనగా శుక్రవారం హైదరాబాదు పోలీసు కమిషనర్ ఎకె ఖాన్ మీడియా సమావేశాన్ని నేలపై కూర్చుకుని కవర్ చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X