వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విద్యార్థుల ర్యాలీ మొదలు: ఉద్రిక్తత

By Pratap
|
Google Oneindia TeluguNews

Osmania Arts College
హైదరాబాద్: తెలంగాణ విద్యార్థుల అసెంబ్లీ ముట్టడి సందర్భంగా శనివారం హైదరాబాదులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి విద్యార్థుల ర్యాలీ ప్రారంభమైంది. దీంతో ఏ క్షణంలో ఏం జరుగుతోందో అనే ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆవరణ దాటితే వారిని అడ్డుకోవడానికి పోలీసులు సిద్ధంగా ఉన్నారు. పోలీసులు విద్యార్థులను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఉస్మానియా ఆవరణ వదలి వెళ్లవద్దని చెప్పిన వైస్ చాన్సలర్ తిరుపతిరావు వాహనంపై విద్యార్థులు రాళ్లతో దాడి చేశారు. విసిని ఘెరావ్ చేశారు. విద్యార్థులతో చర్చించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. మీడియాను దూరంగా వెళ్లాలని పోలీసులు సూచించారు.

నిజాం కళాశాల హాస్టల్ ద్వారాలకు పోలీసులు తాళాలు వేశారు. ఈ హాస్టల్ అసెంబ్లీకి చాలా దగ్గరగా ఉంటుంది. దీంతో గేట్లు మూసేసి విద్యార్థులు బయటకు రాకుండా అడ్డుకుంటున్నారు. సిటీ కళాశాల నుంచి విద్యార్థులు ర్యాలీగా బయలుదేరడానికి ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దాంతో విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులను చేదించుకుని ఎట్టి పరిస్థితిలోనూ అసెంబ్లీని ముట్టడించి తీరుతామని విద్యార్థులు అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు శాసనసభ్యులు రాజీనామా చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి వెలుపలకి వచ్చిన విద్యార్థులను పోలీసులు విద్యానగర్ వద్ద అడ్డుకున్నారు. ఐరన్ కంచెలను దాటి ముందుకు దూసుకెళ్లడానికి విద్యార్థులు ప్రయత్నిస్తున్నారు. విద్యార్థులు విద్యానగర్ వద్ద రోడ్డుపై బైఠాయించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X