వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిదంబరంపై చిటపటలాడిన కోదండరామ్

By Santaram
|
Google Oneindia TeluguNews

Kodandaram
హైదరాబాద్‌: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఏకాభిప్రాయం కావాలంటూ కేంద్ర హోంమంత్రి చిదంబరం తాజాగా మళ్లీ చెప్పడం సరికాదని, ఇలాంటి ప్రకటనలతోనే రాష్ట్ర ఏర్పాటుపై సందిగ్ధ పరిస్థితి నెలకొంటోందని తెలంగాణ ఐక్యకార్యాచరణ సమితి విమర్శించింది. ఆయన పూటకోమాట మారుస్తున్నారని ఆరోపించింది. ఐకాస కన్వీనరు కోదండరాం, నాయకులు శ్రీనివాస్‌గౌడ్‌, ఆకుల భూమయ్య, గోవర్ధన్‌లు ఇక్కడ శనివారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం మూలకుపడేసే ప్రయత్నం చేస్తోందని, కాంగ్రెస్‌ నాయకులు ఐకాస నుంచి తప్పుకుంటామని చెబుతూ మోసపూరితంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలపైనే ఉందన్నారు.

సీమాంధ్ర నేతల మాదిరిగా రాజీనామాలు చేసి ఒత్తిడి పెంచాలని సూచించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు మోసం చేస్తుండటం వల్లే విద్యార్థులు, యువకులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని, సంఘటితంగా పోరాడుదామని ఐకాస పిలుపునిస్తోందన్నారు. శనివారం విద్యార్థులు ఎలగందల శ్రీనివాస్‌, సమీర అనే అమ్మాయి ఆత్మహత్యకు పాల్పడ్డారని, యాదయ్య అనే మరో విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేశారన్నారు. ఇప్పటికీ ఇంకా రాజీనామాలు చేయని ప్రజాప్రతినిధులకు ఆత్మహత్యలు చేసుకున్న వారికి సంబంధించిన వివరాలన్నింటినీ క్రోఢీకరించి పంపిస్తామని చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X