వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ కోసం కాల్చుకున్న యాదయ్య మృతి

By Santaram
|
Google Oneindia TeluguNews

Yadaiah
హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రం కోసం ఆత్మహత్యాయత్నం చేసిన విద్యార్ధి యాదయ్య డీఆర్‌డీఎల్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఆయన మృతదేహాన్ని ఆయన స్వగ్రామం నాగారం( రంగారెడ్డి జిల్లా)కు తరలించారు. యాదయ్య మృతితో నాగారం శోకసాగరంలో మునిగిపోయింది.

హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలంగాణ కోసం విద్యార్థి యాదయ్య ఆత్మాహుతి యత్నానికి పాల్పడ్డాడు. విద్యార్థుల అసెంబ్లీ ముట్టడి ప్రశాంతంగా ముగిసిందని భావిస్తున్న సమయంలో ఈ ఘోర సంఘటన చోటు చేసుకుంది. దీంతో ఉస్మానియా విశ్వవిద్యాలయం గేటు వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసు గో బ్యాక్ అంటూ విద్యార్థులు నినాదాలు చేయడం మొదలు పెట్టారు. ఉస్మానియాలోని పరిపాలన భవనం వద్ద ఒంటికి నిప్పంటించుకుని పోలీసుల వైపు దూసుకొచ్చాడు. దీంతో పోలీసులు, తోటి విద్యార్థులు మంటలనార్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X