పార్లమెంటు ముట్టడికి లాయర్ల యత్నం

న్యాయవాదులను వాటర్ కానన్లతో పోలీసులు చెదరగొట్టారు. తొలి బారికేడ్ ను ఛేదించుకుని పార్లమెంటు ఐదో నెంబర్ గేటు వైపు లాయర్లు దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ సంఘటనలో ఓ లాయర్ గుండెపోటుతో స్పృహ తప్పి పడిపోయాడు. అతన్ని ఆస్పత్రికి తరలించారు.ప్లకార్డులు ప్రదర్సిస్తూ తెలంగాణ అనుకూల నినాదాలు చేస్తూ న్యాయవాదులు జంతర్ మంతర్ వద్ద ధర్నా చేశారు. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బిల్లు ప్రతిపాదించాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. తెలంగాణలోని పది జిల్లాలకు చెందిన న్యాయవాదులు ఈ ధర్నాలో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications