వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాబుల్ దాడి: పది మంది భారతీయుల మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Afghan National Army
కాబూల్: అఫ్షనిస్తాన్ రాజధాని కాబూల్ లో తాలిబన్లు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 17 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 30 మంది గాయపడ్డారు. మృతుల్లో పది మంది భారతీయులు ఉన్నట్లు సమాచారం. కాబూల్ లోని ప్రధాన కూడలి వద్ద గల ఒక పెద్గ షాపింగ్ కాంప్లెక్స్ లో శుక్రవారం ఉదయం ఈ దాడి జరిగింది. ఒక హోటల్ ను, గెస్ట్ హౌస్ ను లక్ష్యంగా చేసుకుని తాలిబన్లు ఆత్మాహుతి దాడికి దిగారు.

దేశ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖకు 300 మీటర్ల దూరంలో గల షాపింగ్ కాంప్లెక్స్, సఫీ ల్యాండ్ మార్కు హోటల్ వద్ద వరుస పేలుళ్లు సంభవించాయి. రెండు ప్రాంతాల్లో ఐదుగురు ఆత్మాహుతి తాలిబన్లు దాడికి దిగినట్లు తాలిబన్ అధికార ప్రతినిధి జబియుల్లా ముజాహీద్ రహస్య ప్రదేశం నుంచి ఫోన్ లో చెప్పాడు. విదేశీయులను, ముఖ్యంగా భారతీయులను లక్ష్యంగా ఎంచుకుని తాలిబన్లు ఈ దాడికి తెగబడ్డారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X