క్వారీ ప్రమాదంలో 20 మంది సజీవ సమాధి

Chimakurthy Quarry
ఒంగోలు: ప్రపంచస్ధాయి గ్రానైట్‌ గనులకు నెలవైన ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలంలో గురువారం సాయంత్రం ఘోర ప్రమాదం సంభవించింది. గ్రానైట్ గనిలో 200 అడుగుల ఎత్తు నుంచి కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ సంఘటనలో 20 మంది కార్మికులు సజీవ సమాధి అయినట్లు భావిస్తున్నారు. ఇప్పటికి రెండు మృతదేహాలను వెలికితీశారు. మండలంలోని రామతీర్థం వద్దగల 'హంస మినరల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌(న్యూట్రిన్‌) గ్రానైట్‌' పరిధిలో ఈ సంఘటన జరిగింది.

సాయంత్రం 6.45 గంటలప్పుడు 200 అడుగుల లోతున క్వారీలో యంత్రాలతో కార్మికులు గెలాక్సీ గ్రానైట్‌ను వెలికితీస్తుండగా..ఒక్కసారిగా భారీ శబ్దంతో క్వారీ అంచులు కుప్పకూలాయి. విరిగిపడ్డ కొండ చరియల కింద కార్మికులతోపాటు 2 పొక్లెయిన్లు, మరికొన్ని యంత్రాలు చిక్కుకున్నాయి. సంఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. విరిగిన కొండచరియలు రెండు వేల టన్నులకుపైగా ఉండటంతో శకలాలు తొలగించడానికి రెండ్రోజులు పట్టొచ్చు. సంఘటనకు బాధ్యులుగా హంస గ్రానైట్‌ క్వారీ జనరల్‌ మేనేజర్‌ చంద్రారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యమంత్రి రోశయ్య చొరవతో కలెక్టర్, ఎస్పీలు వెలికితీత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ప్రకాశం జిల్లాలో సుమారు 43 క్వారీలు నడుస్తుండగా- చీమకుర్తి కేంద్రంగా క్వారీల్లో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులు పనిచేస్తున్నారు. పదేళ్లలో 145 మంది కార్మికులు చనిపోయినట్టు గణాంకాలు చెబుతున్నాయి. కొందరు క్వారీ యజమానులు ప్రమాదాలను నొక్కి పెడుతుండటంతో మరెన్నో మరణాలు వెలుగులోకి రావటం లేదు. ఈ ప్రమాదాలకు ప్రధానంగా భద్రతా లోపాలే కారణం. కార్మికులకు అవసరమైన హెల్మెట్లు, కళ్లద్దాలు, బూట్లు, ఇతర రక్షణ సౌకర్యాలేమీ కల్పించడం లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+