ఒయులో బలగాలపై త్రిసభ్య కమిటీ: సుప్రీం

Osmania Arts College
న్యూఢిల్లీ: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అదనపు బలగాల మోహరింపుపై త్రిసభ్య కమిటీ వేయాలని సుప్రీంకోర్టు శుక్రవారం ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కమిటీలో హోం శాఖ కార్యదర్శితో పాటు నగర పోలీసు కమిషనర్, విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ లతో త్రిసభ్య కమిటీ వేయాలని ఆదేశించింది. ఒయులో బలగాల మోహరింపుపై ఈ త్రిసభ్య కమిటీ పది రోజుల్లో నివేదిక అందజేయాలని కూడా ఆదేశించింది. సీల్డ్ కవర్ లో ఈ నివేదికను అందజేయాలని సూచించింది. తదుపరి విచారణను మార్చి 19వ తేదీకి విచారణను వాయిదా వేసింది. ఒయులో శాంతిభద్రతల పరిరక్షణకు తీసుకునే చర్యలపై త్రిసభ్య కమిటీ ఆధ్వర్యంలో జరగాలని తెలిపింది.

త్రిసభ్య కమిటీ సూచన మేరకే ఒయులో బలగాల మోహరింపు ఉండాలని స్పష్టం చేసింది. ఒయులో బలగాల మోహరింపునకు దారి తీసిన పరిస్థితులను వివరించాలని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రస్తుతానికి బలగాల మోహరింపు యధాతథంగా ఉంటుందని తెలిపింది. హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ విచక్షణ మేరకు ఉస్మానియాలో సివిల్ పోలీసుల మోహరింపు ఉంటుందని తెలిపింది. ఒయులో బలగాలెందుకో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగింది. ఒయులో నక్సల్స్ ఉనికిపై ఆధారాలు చూపాలని కూడా ఆదేశించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+