వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పన్నుల విధానం సులభతరం: ప్రణబ్ ముఖర్జీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Pranab Mukherjee
న్యూఢిల్లీ: ప్రత్యక్ష పన్నుల విషయంలో నూతన విధానాన్ని అమలు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ చెప్పారు. సాధారణ బడ్జెట్ ను ఆయన శుక్రవారం పార్లమెంటులో ప్రతిపాదించారు. పన్నుల విధానాన్ని సులభతరం చేస్తామని హామీ ఇచ్చారు. జిఎస్టీ అమలుకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రత్యక్ష పన్నులను, జిఎస్టీని అమలు చేస్తామని ఆయన చెప్పారు. ఉద్దీపన పథకాలను ఒకేసారి కాకుండా క్రమేణా ఉపసంహరించుకుంటామని ఆయన చెప్పారు. ఏప్రిల్ నుంచి పోషక ఎరువుల విధానాన్ని అమలు చేస్తామని, సబ్సిడీ నేరుగా రైతులకు అందేలా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. ఎరువుల సబ్సిడీని క్రమబద్ధీకరించడమే లక్ష్యమని ఆయన చెప్పారు. ఎరువుల పంపిణీని క్రమబద్దీకరిస్తామని ఆయన చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థల నుంచి 25 వేల కోట్ల పెట్టుబడులను ఉపసంహరిస్తామని ఆయన చెప్పారు.

ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం కొనసాగుతున్నప్పటికీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహం స్థిరంగా ఉందని, నిరుడు 20.9 బిలియన్ డాలర్ల ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయని ఆయన చెప్పారు. ఎఫ్డీఐ నిదులను ఏకీకృతం చేస్తామని అన్నారు. ఆర్థిక స్థిరత్వం, అభివృద్ధికి ఒక మండలిని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. విదేశీ రుణాలను క్రమంగా తగ్గిస్తామని చెప్పారు. ప్రభుత్వ రుణాలపై ఈ ఏడాది శ్వేతపత్రం విడుదల చేస్తామని అన్నారు. ప్రాథమిక విద్యకు నిధులు పెంచుతామని చెప్పారు. ఆహార భద్రతకు, గ్రామీణాభివృద్ధికి మరింత ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X