సరైన దిశలోనే సాగుతున్నాం: ప్రణబ్ ముఖర్జీ

Pranab Mukherjee
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థ విషయంలో తాము సరైన దిశలోనే సాగుతున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. 2010-2011 సాధారణ బడ్జెట్ ను ఆయన శుక్రవారం పార్లమెంటులో ప్రతిపాదించారు. ప్రణబ్ ముఖర్జీ వరుసగా మూడోసారి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. అనిశ్సిత స్థితి నుంచి ప్రారంభమై ప్రగతిదిశగా సాగుతున్నామని ఆయన అన్నారు. ఆహార ద్రవ్యోల్బణం పట్ల కేంద్రం ఆందోళన చెందుతోందని ఆయన చెప్పారు. గ్రామాల్లో ఆహార భద్రతను కల్పించడం అవసరమని ఆయన చెప్పారు. ఆర్థిక వ్యవస్థ విషయంలో ముందుకు సాగుతున్నామని, సవాళ్లను ధీటుగా ఎదుర్కుంటున్నామని ఆయన అన్నారు. అభివృద్ధి రేటు రెండంకెలకు చేరడమే లక్ష్యమని ఆయన అన్నారు.

కొత్త పింఛను పథకాలను అమల్లోకి తేవాల్సిన అవసరం అవసరం ఉందని ఆయన చెప్పారు. గత 8 ఏళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ మెరుగైందని ఆయన చెప్పారు. 9 శాతం వృద్ధిరేటును సాధించడం ప్రస్తుత లక్ష్యమని ఆయన చెప్పారు. సామాజిక రంగాల్లో సంస్కరణలకు ప్రాధాన్యం ఇస్తామని ఆయన చెప్పారు. పది శాతం వృద్ధి రేటు త్వరలోనే సాధ్యమని ఆశించారు. విద్యుత్ రంగంలో నష్టాలను అరికట్టాల్సి ఉందని ఆయన చెప్పారు. గత ఏడాదితో పోలిస్తే భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉందని ఆయన చెప్పారు. ప్రజాపంపిణీ వ్యవస్థలో అడ్డంకులు తొలగిస్తామని హామీ ఇచ్చారు. భారత ఆర్థిక వ్యవస్థ మందగమనం నుంచి బయట పడిందని అన్నారు. కేంద్ర బడ్జెట్ అంకెలకే పరిమితం కాదని అన్నారు. ఎగుమతుల్లో అభివృద్ధి నమోదైందని చెప్పారు. సవాళ్లు మనల్ని రాటుదేలేలా చేశాయని ప్రణబ్ ఉన్నారు. ప్రజాపంపిణీ వ్యవస్థను ఆధునీకరిస్తామని చెప్పారు. కరవు, వాతావరణ మార్పిడిల వల్ల ఆహార దిగుబడి తగ్గిందని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+