కెసిఆర్ ను దెబ్బ తీయడానికేనా?
పార్టీపరంగా చూస్తే, తెలంగాణలో తెరాసను, ముఖ్యంగా ఆ పార్టీ అధ్యక్షుడు కె చంద్రశేఖర రావును దెబ్బ తీయడమే లక్ష్యంగా కాంగ్రెసు పనిచేస్తున్నట్లు చెబుతున్నారు. తెలంగాణ అంశంపై ప్రజాప్రతినిధులందరూ రాజీనామాలు చేయాలని, రాజీనామాలు చేసిన వారిని తాము ఏకగ్రీవంగా గెలిపిస్తామని తెలంగాణ జెఎసి ప్రకటించింది. అయితే ఏకగ్రీవం కాకుండా చూడడం ఇప్పుడు కాంగ్రెసు పనిగా మారింది. కాంగ్రెసు దారిలోనే మెల్లగా తెలుగుదేశం పార్టీ కూడా పయనించవచ్చు. మూడో రాజకీయ పార్టీ ఉండడం ఈ రెండు పార్టీలకు కూడా ఇష్టం లేదు. రాష్ట్రంలో రెండు పార్టీల వ్యవస్థ మాత్రమే ఉండి, తామే ప్రాబల్యం సాధించాలనే అభిప్రాయంతో ఈ రెండు పార్టీలున్నాయి. పైగా, తెరాస వల్ల, కెసిఆర్ వల్ల ఈ రెండు పార్టీల నాయకులు కూడా తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాయి. తెరాస నుంచి పోటీని పెద్ద యెత్తునే ఈ రెండు పార్టీలు ఎదుర్కుంటున్నాయి. ఉప ఎన్నికల్లో తెరాసను దెబ్బ తీయడం ద్వారా తెలంగాణ నినాదాన్ని బలహీనపరచడం కూడా ఈ రెండు పార్టీల లక్ష్యం కావచ్చు.