వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బొత్సా ప్రకటనకు కోమటిరెడ్డి స్వాగతం

By Pratap
|
Google Oneindia TeluguNews

Komitireddy Venkat Reddy
హైదరాబాద్: రాష్ట్రం రెండుగా విడిపోతే మంచిదన్న కోస్తాంధ్రకు చెందిన రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యను తెలంగాణకు చెందిన రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వాగతించారు. రాష్ట్రం విడిపోవాలని సెటిలర్లు కోరుకుంటున్నట్లు ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలుగువారికి రెండు రాష్ట్రాలు ఉండడం మంచిదేనని ఆయన అన్నారు.

రాష్ట్రం సామరస్యపూర్వరంగా విడిపోవాలని, ప్రజలు అన్నదమ్ముల్లా రెండు రాష్ట్రాలుగా విడిపోవాలని అందరూ కోరుకుంటున్నారని ఆయన అన్నారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ పోటీ చేయాలా, వద్దా అనే విషయంపై తమ అధిష్టానం చూసుకుంటుందని ఆయన అన్నారు. ఉప ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ చేసిన ప్రకటనపై ఆయన ఈ విధంగా ప్రతిస్పందించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X