ప్రకాశం: టీడీపీ నిజ నిర్ధారణ బృందంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి దిగారు. అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో రక్షణ కల్పించలేమని పోలీసులు చేతులెత్తేశారు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం పందిళ్లపల్లిలో చోటు చేసుకుంది. దాడి చేసినవారు స్థానిక ఎమ్మెల్యే అనుచరులని టీడీపీ ఆరోపిస్తోంది. ఇదంతా కావాలనే ముందుస్తుగా అనుకున్న ఓ ప్రణాళిక ప్రకారమే దాడి జరిగిందని అంటున్నారు. అలాగే ఈ విషయం పోలీసులకు కూడా ముందే తెలుసని, అనుకున్న ప్రకారమే రక్షణ పోలీసులు చేతులెత్తేశారని తెలుగుదేశం పార్టీ చెప్పుకొస్తోంది.