నిర్మలమ్మ శాఖ మార్పు, ప్రధాన్ ఔట్- నితీశ్..చద్దా బాధ్యతలు ఫిక్స్, ఎవరికి ఏ శాఖ..!!
మోదీ 4.0 కి భారీ కసరత్తు జరుగుతోంది. కేంద్ర మంత్రివర్గంలో త్వరలో భారీ మార్పులు జరగను న్నాయి. అందులో భాగంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శాఖలో మార్పు ఉంటుందని తెలుస్తోంది. ధర్మేంద్ర ప్రధాన్ ను తప్పించనున్నారు. రాఘవ చద్దా.. నితీశ్ కు కీలక శాఖలు దక్కనున్నాయి. పలువురు మంత్రుల శాఖలు మార్పు పై కసరత్తు జరుగుతోంది. పలువురు సహాయ మంత్రులకు ఉద్వాసన పలుకుతారని సమాచారం. నిర్మలా సీతారామన్ శాఖ పైన కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి.
ప్రధాని మోదీ మిషన్ 2029 మొదలు పెట్టారు. ప్రభుత్వం .. పార్టీలో తన మార్క్ నిర్ణయాల అమలు దిశగా కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వంలో అవసరమైన మార్పులు చేయాలని నిర్ణయించారు. దాదాపు 17 మందిని మంత్రివర్గం నుంచి ఉద్వాసన ఉందని తెలుస్తోంది. మరి కొందరు మంత్రులకు పార్టీ బాధ్యతలు అప్పగించనున్నారు. ఇక, కీలక శాఖలు పర్యవేక్షిస్తున్న మంత్రుల శాఖల్లోనూ మార్పులు చేయనున్నారు. టాప్ -3 లో ఉన్న హోం, రక్షణ, రవాణా శాఖల్లో మార్పుకు అవకాశం లేదని తెలుస్తోంది. అదే విధంగా ప్రస్తుతం ఆర్దిక మంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్ కు విద్య శాఖ కేటాయించే అవకాశం ఉంది. నీట్.. సీబీఎస్ఈ వివాదంతో ఆత్మరక్షణలో పడే పరిస్థితి రావటంతో ధర్మేంద్ర ప్రధాన్ శాఖను నిర్మల కు కేటాయిస్తారని తెలుస్తోంది. అదే విధంగా వాణిజ్య శాఖ పర్యవేక్షిస్తున్న పీయూష్ గోయల్ కు ఆర్దిక శాఖ అప్పగించేందుకు రంగం సిద్దమైంది.

కీలక మార్పులు... పార్టీ బాధ్యతలు
కాగా, రైల్వే మంత్రి అశ్విణీ వైష్ణవ్ కు వాణిజ్య శాఖ అప్పగించే ఛాన్స్ ఉందని సమాచారం. కొత్తగా ప్రక్షాళన మొత్తం 2029 ఎన్నికలే టార్గెట్ గా ఎలక్షన్ టీంగా ఉండనుంది. దీనికి అనుగుణంగా మార్పులు చేయనున్నారు. భారీ ప్రక్షాళన ఉంటుందని సమాచారం. హౌసింగ్ మంత్రి మనోహర్ కట్టర్ ను గవర్నర్ గా పంపే అవకాశం ఉంది. అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ కు పార్టీ సంస్థాగత బాధ్యతలు కేటాయించే ఛాన్స్ కనిపిస్తోంది. సహాయ మంత్రుల్లో నలుగురి మార్పు ఖాయమని తెలుస్తోంది.
ఏడాది కాలంలో జరిగే అసెంబ్లీ ఎన్నికలను పరిగణలోకి తీసుకొని కేంద్ర మంత్రివర్గంలో మార్పులకు అవకాశం కనిపిస్తోంది. సాంకేతిక, ఆర్దిక శాఖల్లో పట్టున్న ఇద్దరు మాజీ బ్యూరోక్రాట్లకు సహాయక మంత్రులుగా అవకాశం దక్కనుంది. నితీశ్ కు వ్యవసాయ శాఖ.. రాఘవ చద్దాకు రైల్వే శాఖ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఏపీ నుంచి మరో సహాయ మంత్రి, తెలంగాణ నుంచి మరో ఇద్దరికి కేంద్ర మంత్రివర్గంలో అవకాశం దక్కే పరిస్థితులు ఉన్నాయని పార్టీ నేతల సమాచారం. దీంతో.. మోదీ మార్క్ కేబినెట్ ప్రక్షాళన పైన ఉత్కంఠ నెలకొంది.












Click it and Unblock the Notifications