విజయవాడ: ముగ్గురు ఇంజినీరీంగ్ కాలేజి స్టూడెంట్స్ కిడ్నాప్ అయ్యారు. కృష్ణా జిల్లా తాడిగడపలో ఈ సంఘటన చోటు చేసుకుంది. పోలీసులకు తోటి విధ్యార్దులు కంప్లైంట్ ఇచ్చారు. ఆ పిర్యాదులో దాదాపు 20 మంది కారుల్లో వచ్చి ఈ ముగ్గురిని తీసుకువెళ్లినట్లు తెలిపారు. అలాగే వారెవరో తాము ఎప్పుడూ చూడలేదని, గుర్తు తెలియదని చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ విద్యార్దులు వ్యక్తిగత జీవితం గురించి ఎంక్వైరీ చేయటం ద్వారా ఆ వ్యక్తులు ఎవరనేది కనిపెట్టవచ్చని ఆ దశలో ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నారు.