వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అందరూ కలిసుండాలి: చంద్రబాబు

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: అందరూ కలిసుండాలని హోలీ పర్వదినం సందేశం ఇస్తుందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. చంద్రబాబు సోమవారం తన నివాసంలో హోలీ పర్వదినాన్ని జరుపుకున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు చంద్రబాబు నివాసానికి చేరుకుని హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, శాంతిభద్రతలు బాగుండాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. రాష్ట్ర, దేశ ప్రజలకు ఆయన హోలీ శుభాకాంక్షలు తెలిపారు.

కాగా, రాజభవన్ లో గవర్నర్ నరసింహన్ హోలీ వేడుకలు నిర్వహించుకున్నారు. ఆయన పూర్తిగా రంగుల్లో మునిగిపోయారు. ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం విద్యార్థులు ఆయనతో హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలకు ఆయన హోలీ శుభాకాంక్షలు తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X