వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బొత్స వ్యాఖ్యలు అర్థరహితం: కళా

By Pratap
|
Google Oneindia TeluguNews

Kala Venkata Rao
విశాఖపట్నం: రాష్ట్ర విభజన మంచిదేనన్న పంచాయతీరాజ్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణపై ప్రజారాజ్యం పార్టీ నాయకుడు కళా వెంకటరావు తీవ్రంగా మండిపడ్డారు. బొత్స వ్యాఖ్యలు అర్థరహితమని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ముఖ్యమంత్రి పదవి కోసం రాష్ట్ర విభజనను కోరుకోవడం మంచిది కాదని ఆయన అన్నారు. రాష్ట్రానికి ఇద్దరు ముఖ్యమంత్రులు అవసరం లేదని ఆయన అన్నారు. శ్రీకృష్ణ కమిటీ ముందు అన్ని పార్టీల రంగు బయటపడుతుందని ఆయన అన్నారు. ఉత్తరాంధ్రకు పది వేల కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

బొత్స సత్యనారాయణపై తెలుగుదేశం పార్టీ నాయకుడు కె ఎర్రంనాయుడు మరోసారి ధ్వజమెత్తారు. విజయవాడ ప్రత్యేకాంధ్ర రాజధాని అయితే తమకు దగ్గరగా ఉంటుందన్న బొత్స వ్యాఖ్యలను ఆయన ఎద్దేవా చేశారు. బొత్స సత్యనారాయణ భువనేశ్వర్ నో, కోల్ కత్తానో రాజధానిగా కోరుకుంటే మరింత దగ్గరగా ఉంటుందని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X