కెసిఆర్ ఒకప్పుడు సమైక్యవాది: కోడెల

Kodela Sivaprasad Rao
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఒకప్పుడు బలమైన సమైక్యవాది అని తెలుగుదేశం పార్టీ నాయకుడు డాక్టర్ కోడెల శివప్రసాద రావు అన్నారు. కెసిఆర్ ది రాజకీయ ఆరాటమే తప్ప పోరాటం కాదని ఆయన వ్యాఖ్యానించారు. తన కుటుంబానికంతటికీ పదవులు తీసుకున్న పంచాయతీరాజ్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఉత్తరాంధ్రకు ఏం చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్రకు బొత్స చేసిందేమీ లేదని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.

నిన్నమొన్నటి దాకా సమైక్యవాదం వినిపించిన బొత్స సత్యనారాయణ అకస్మాత్తుగా రాష్ట్ర విభజనను కోరుకుంటున్నారని, బొత్స అలా ఎందుకు మారిపోయారో అర్థం కావడం లేదని ఆయన అన్నారు. బొత్స సత్యనారాయణది ఊసరవెల్లి తత్వమని ఆయన వ్యాఖ్యానించారు. బొత్స సత్యనారాయణ శిఖండిలా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. బొత్స సత్యనారాయణ సమైక్యవాదులైన సీమాంధ్ర ప్రజల మనోభావాలను దెబ్బ తీస్తున్నారని ఆయన విమర్శించారు. యుపిఎ ప్రభుత్వం ఇప్పటికే ఏడెనిమిది సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిందని, ధరలపై తాము పోరాటం చేస్తామని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+