శ్రీకృష్ణ కమిటీకి నివేదిక ఇస్తాం: కెసిఆర్

తెలంగాణ జెఎసి నిర్ణయం మేరకే తాము రాజీనామాలు చేశామని ఆయన చెప్పారు. శాసనసభ ఉప ఎన్నికల నోటిఫికేషన్ 14, 15 రోజుల్లో రావచ్చునని ఆయన అన్నారు. ఉప ఎన్నికల్లో తమను ఏకగ్రీవంగా గెలిపించాలని ఏ పార్టీని కూడా అడగబోమని ఆయన చెప్పారు. పంచాయతీరాజ్ మంత్రి బొత్సను ప్రజల మనిషిగా ఆయన అభివర్ణించారు. బొత్స తన కన్నా గట్టిగా మాట్లాడారని ఆయన కొనియాడారు. సమైక్యాంధ్ర వల్ల సాధించేదేమిటన్న బొత్స ప్రశ్నకు ఎవరూ సమాధానం చెప్పలేకపోయారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications