నేడే అధికమాస జ్యేష్ట పూర్ణిమ- 16 కళలతో నిండుగా: మళ్లీ మూడేళ్ల తర్వాతే

నేడు.. జ్యేష్ఠ అధిక మాస పౌర్ణమి. హిందూ విశ్వాసాల ప్రకారం అత్యంత పవిత్రమైన ఈ జ్యేష్ఠ పూర్ణిమ రోజున చంద్రుడు తన 16 కళలతో నిండుగా ప్రకాశిస్తాడు. పురాణాల ప్రకారం.. చంద్రుడు మన మనస్సులను ప్రభావితం చేస్తాడు. అందుకే దీనిని శక్తికి, ఆధ్యాత్మిక పురోగతికి ప్రతీకగా భావిస్తారు. ఈ విశిష్టమైన పౌర్ణమి నాడు చంద్రుడికి అర్ఘ్యం సమర్పించడం వల్ల మానసిక ప్రశాంతత, కుటుంబ సుఖశాంతులు లభిస్తాయని భక్తులు నమ్ముతారు.

ఈ అధిక మాస పౌర్ణమి ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఆవిర్భవిస్తుంది. ఇది అత్యంత అరుదైన సందర్భం. హిందూ ధర్మంలో ఏ పౌర్ణమి తిథికైనా విశేష ప్రాముఖ్యత ఉంటుంది. ఈ అధిక మాస పౌర్ణమి శ్రీ మహావిష్ణువు, చంద్రుడు, పితృదేవతలను పూజించడానికి ఎంతో ప్రత్యేకమైన రోజుగా పరిగణిస్తారు. జ్యేష్ఠ పౌర్ణమి నాడు శాస్త్రోక్తంగా పూజలు చేయడం వల్ల జీవితంలో సుఖసంతోషాలు కలుగుతాయని, జాతకంలోని గ్రహదోషాల ప్రభావం తగ్గుతుందని విశ్వాసం.

Unlock Cosmic Blessings on Adhik Maas Jyestha Poornima with Vishnu the Moon and Ancestors today

అలాంటి విశేష ప్రాముఖ్యత ఉండే జ్యేష్ఠ అధిక పౌర్ణమి తిథి పంచాంగం ప్రకారం పౌర్ణమి ఇప్పటికే ఆరంభమైంది. శనివారం ఉదయం 11:57 నిమిషాలకు మొదలైంది. ఈ మధ్యాహ్నం 2:14 నిమిషాల వరకు ఉంటుంది. ఉదయాతిథి ఆధారంగా నేడు జ్యేష్ట పౌర్ణమిని జరుపుకోవాలి.

ఈ పవిత్రమైన రోజున స్నాన, దానాలను ఆచరించడానికి కొన్ని శుభ ముహూర్తాల వివరాల్లోకి వెళ్తే.. బ్రహ్మ ముహూర్తం తెల్లవారు జామున 4:34 నుండి 5:17 నిమిషాల వరకు, అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:10 నుండి 1:03 నిమిషాల వరకు, విజయ ముహూర్తం మధ్యాహ్నం 2:48 నుండి 3:41 నిమిషాల వరకు ఉంటాయి. ఈ వేళల్లో చేసే పూజలు మరింత ఫలవంతంగా భావిస్తారు.

అధిక జ్యేష్ఠ పౌర్ణమి నాడు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి, పరిశుభ్రమైన వస్త్రాలు ధరించాలి. ఒక బల్లపై శ్రీ మహావిష్ణువు విగ్రహాన్ని లేదా చిత్రాన్ని ప్రతిష్టించాలి. గంగాజలంతో అభిషేకం చేసి, పసుపు రంగు పువ్వులను సమర్పించాలి. నెయ్యి దీపం వెలిగించి, తులసి ఆకు వేసిన పాయసాన్ని, పసుపు రంగు నైవేద్యాన్ని నివేదించాలి. చివరగా విష్ణు మంత్రాలను జపించాలి.

రాత్రి సమయంలో చంద్రుడిని పూజించడం చాలా ముఖ్యం. పచ్చి పాలతో అర్ఘ్యం ఇచ్చి, ఆయన అనుగ్రహంతో సుఖసంతోషాలు, శ్రేయస్సు పొందవచ్చు. ఈ రోజు మధ్యాహ్నం పితృదేవతలను పూజించడం కూడా ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. దక్షిణ దిశను పితృదేవతల దిశగా భావించి, ఆ దిశలో శ్రాద్ధం, తర్పణం, పిండ ప్రదానం చేయడం ద్వారా వారి ఆశీస్సులు కుటుంబానికి లభిస్తాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+