సెక్స్ స్కాం: నిత్యానంద స్వామిపై 420 కేసు
విచారణ ఆధారంగా రంజితపైనా చర్య తీసుకునేందుకు నిర్ణయించారు. నిత్యానందం, రంజితలు అజ్ఞాతంలో ఉండడంతో గాలింపు నిమిత్తం సెంట్రల్ క్రైం బ్రాంచ్ పోలీసుల నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దించారు. కోయంబత్తూర్ లోనూ ఇదే తరహాలో పోలీసులు కేసులు నమోదు చేస్తుండడంతో నిత్యానందం మెడ కు మరింత ఉచ్చు బిగుస్తోంది. దీంతో అప్రమత్తమైన ధ్యాన పీఠం ప్రతినిధులు చెన్నై సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. ఆ అశ్లీల సీడీలో కన్పిస్తున్న వ్యక్తి నిత్యానందం కాదని, హైటెక్నాలజీని ఉపయోగించి మాఫింగ్ చేశారని, అందుకే ఆ ప్రసారాలను నిలుపుదల చేయాలని విన్నవించారు. ఆ మేరకు ప్రసారాలను నిలిపి వేయాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో నిత్యానందం ఆధ్యాత్మిక పీఠం పీఆర్ఓ నిత్యాత్మ ప్రభానంద, నిత్యానందం న్యాయవాది శ్రీధర్ సరికొత్త చర్చను తెరపైకి తీసుకొచ్చారు. పాత కక్షతోనే సన్ నెట్ వర్క్ పదే పదే ఆ సీడీని ప్రసారం చేస్తోందని విలేకరుల సమావేశంలో ఆరోపించారు.