బిజెపి రాష్ట్రాధ్యక్షుడిగా కిషన్ రెడ్డి
నామినేషన్ వేయాలని బద్ధం బాల్ రెడ్డి భావించారు. పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ ప్రకాష్ జవదేకర్ జోక్యంతో ఆయన వెనక్కి తగ్గారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్లో కిషన్ రెడ్డి (44) జన్మించారు. పార్టీ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూ, పార్టీ కార్యాలయంలోనే ఉంటూ చదువు సాగించారు. యువమోర్చా జాతీయ అధ్యక్ష బాధ్యతలనూ నిర్వహించారు. 2004 ఎన్నికల్లో హిమాయత్ నగర్ నుంచి, 2009తో అంబర్ పేట నుంచి ఆయన ఎన్నికయ్యారు. గత అసెంబ్లీలో శాసనసభాపక్ష నేతగా ఉన్న ఆయన ప్రస్తుతమూ అదే పదవిలో కొనసాగుతున్నారు. బిజెపిలోనే కాకుండా అంతకు ముందు బిజెవైయంలో కీలక పాత్ర పోషించారు. మీడియాకు ఆయన మంచి మిత్రుడిగా పేరు తెచ్చుకున్నారు.
Comments
Story first published: Saturday, March 6, 2010, 10:02 [IST]