విద్యుత్ కోతపై అసెంబ్లీలో దుమారం
సభను వాయిదా వేసి అన్ని పార్టీల శాసనసభా పక్షాల నేతలతో స్పీకర్ చర్చలు జరిపారు. విద్యుత్ కోతపై రేపు చర్చ జరిపేందుకు ప్రభుత్వం ఈ సమావేశంలో అంగీకరించింది. విద్యుత్ కోతపై చర్చకు ప్రభుత్వం ఆమోదం తెలపడంతో ఆ తర్వాత సభ నడిచింది. విద్యుత్ కోతకు నిరసనగా ప్రజారాజ్యం పార్టీ శానసభ్యులు మంగళవారం ఉదయం వినూత్న రీతిలో నిరసన తెలిపారు. లాంతర్లతో వారు శాసనసభకు వచ్చారు. తెలుగుదేశం, వామపక్షాలు లాంతర్లతో గన్ పార్కు వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించిన విషయం తెలిసిందే.
Comments
శాసనసభ విద్యుత్ కోత ప్రతిపక్షాలు స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ assembly power cut opposition speaker kiran kumar reddy hyderabad
Story first published: Tuesday, March 9, 2010, 10:30 [IST]