E20 పెట్రోల్ ను ముందే వద్దన్న మారుతీ, టాటా మోటార్స్, మహీంద్రా? షాకింగ్ రిపోర్ట్..!

ఇరాన్ వార్ నేపథ్యంలో దేశ ఇంధన భద్రత పేరుతో కేంద్ర ప్రభుత్వం ఇథనాల్ కలిపిన పెట్రోల్ ను వాహనదారులకు అలవాటు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. అయితే ఇలా 20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్ (E20)వాడకం వల్ల తమ వాహనాలు పాడైపోతున్నాయని, మైలేజ్ కూడా తగ్గిపోతుందని వాహనదారులు ఆరోపించడం ప్రారంభించారు. దీంతో కేంద్రం ఇప్పుడు పదే పదే ఈ20 పెట్రోల్ తో ఎలాంటి నష్టం లేదని చెప్పుకొస్తోంది. అయినా ఈ20ని వాహనదారుల కంటే ముందు కార్ల తయారీ సంస్థలే వద్దని చెప్పినట్లు అంతర్జాతీయ వార్తా సంస్ద రాయిటర్స్ బయటపెట్టింది.

విపక్షాలకు అమిత్ షా బంపర్ ఆఫర్..! తోసిపుచ్చిన రాహుల్..!
విపక్షాలకు అమిత్ షా బంపర్ ఆఫర్..! తోసిపుచ్చిన రాహుల్..!

కేంద్రం తాజాగా ఇథనాల్ కలిపిన పెట్రోల్ వాడకం వల్ల ఎలాంటి నష్టం లేదని పదే పదే చెప్తున్న తరుణంలో కార్ల తయారీదారుల సంస్థ అయిన సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (SIAM)కు గతంలో తాము పంపిన మెయిల్స్ ను మారుతీ, టాటా మోటార్స్, మహీంద్రా వంటి సంస్థలు వెనక్కి తీసుకున్నాయి. అయితే ఇంతకీ ఆ మెయిల్స్ లో అవేం చెప్పాయన్న దానిపై రాయిటర్స్ వివరాలు వెల్లడించింది. ఇందులో ఆయా సంస్థలు ఇథనాల్ కలిపిన పెట్రోల్ లో మితిమీరిన క్లోరైడ్, తేమ శాతం ఉండటం వల్ల వాహనాల ఇంజన్లు దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరించినట్లు తేలింది. ఈ సంస్థలకు దేశంలో 67 శాతం కార్ల వాటా ఉంది.

E20 Fuel Row Maruti Tata Motors Mahindra Flagged Concerns With Auto Industry Body
పెట్రోల్ కార్లా ? వద్దు బాాబోయ్..! E20 దెబ్బకు సేల్స్ ఢమాల్- భారీ డిస్కౌంట్లు..!
పెట్రోల్ కార్లా ? వద్దు బాాబోయ్..! E20 దెబ్బకు సేల్స్ ఢమాల్- భారీ డిస్కౌంట్లు..!

ఆయా కార్ల తయారీ సంస్థలు బహిరంగంగా ఈ20 వినియోగాన్ని సమర్థిస్తున్నప్పటికీ.. దీని నాణ్యతపై మాత్రం అంతర్గతంగా తీవ్ర ఆందోళన చెందుతున్నట్టు దీన్ని బట్టి అర్దమవుతోంది. దేశంలోని దాదాపు 18 రాష్ట్రాల నుండి సేకరించిన 250కి పైగా ఇంధన నమూనాల పరీక్షల్లో ఇంధన నాణ్యత సరిగా లేదని పరిశ్రమ వర్గాలు గుర్తించాయి. కార్ల తయారీ సంస్థలు స్వయంగా నిర్వహించిన పరీక్షల్లో ఈ విషయం బయటపడింది. నిబంధనల ప్రకారం పెట్రోల్‌లో క్లోరైడ్ కేవలం 3 పీపీఎమ్ మాత్రమే ఉండాల్సి ఉండగా.. ఢిల్లీ, మహారాష్ట్ర, రాజస్థాన్ వంటి చోట్ల దీని స్థాయి 1.4 నుండి 570 పీపీఎమ్ వరకు ఉందని తేలింది. దీని వల్ల వాహనాల ఇంధన ఇంజెక్టర్లు దెబ్బతినే ప్రమాదం ఉంది. అలాగే పెట్రోల్‌లో తేమ శాతం ఎక్కువైతే వాహనాలు ప్రయాణ మధ్యలో అకస్మాత్తుగా ఆగిపోయే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+