ప్రతిపక్షాలు సహకరించడం లేదు: సిఎం

సిఎం క్యాంపు కార్యాలయంలో ఉదయం 9 నుంచి పదిన్నర గంటల వరకు, సాయంత్రం ఆరు నుంచి రాత్రి 8 గంటల వరకు తాను అందరికీ అందుబాటులో ఉంటానని, ఉదయం పూట ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తానని ఆయన చెప్పారు. నా హృదయ స్పందన అనే పుస్తకాన్ని తాను చదవలేదని, ఆవిష్కరించమంటే అవిష్కరించానంతేనని ఆయన అన్నారు. పుస్తకాన్ని చదవే సమయం తనకు లేదని ఆయన అన్నారు. నా హృదయం స్పందన అనే పుస్తకంలో రాష్ట్ర విభజనను కోరుతున్నవారిపై తీవ్ర వ్యాఖ్యలు ఉండడంతో రోశయ్య దాన్ని ఆవిష్కరించడం వివాదానికి దారి తీసింది.












Click it and Unblock the Notifications