కొందరు మంత్రులపై రోశయ్య వేటు?

ఏప్రిల్ మొదటివారంలో ఆయన ఢిల్లీ వెళ్లి మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెసు పార్టీ అధిష్టానం అనుమతి తీసుకుంటారని, ఒక జాబితాను కూడా సమర్పించి ఆమోదం తెచ్చుకోనున్నట్లు చెబుతున్నారు. పలువురు సీనియర్ శాసనసభ్యులు మంత్రి పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్ కూడా మంత్రివర్గంలో చేరే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. హైదరాబాదుకు సంబంధించి మర్రి శశిధర్ రెడ్డి, శంకరరావు, కడప జిల్లాకు చెందిన డిఎల్ రవీంద్రా రెడ్డి, అనంతపురం జిల్లాలో జెసి దివాకర్ రెడ్డి మంత్రి పదవులు ఆశిస్తున్నారు. స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి కూడా మంత్రి పదవి ఆశిస్తున్నట్లు చెబుతున్నారు. నల్లగొండ జిల్లాకు చెందిన కె. జానారెడ్డి కూడా మంత్రి పదవి రేసులో ఉన్నారు.












Click it and Unblock the Notifications