హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సజావుగా పదో తరగతి పరీక్షలు

By Pratap
|
Google Oneindia TeluguNews

SSC Exmas
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సజావుగా పదో తరగతి పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. వచ్చే నెల 8వ తేదీ వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. రాష్ట్రంలోని 6,755 కేంద్రాల్లో జరిగే ఈ పరీక్షలకు 13.63 లక్షల మంది విద్యార్థులు హాజరవుతున్నారు. ఉదయం తొమ్మిదిన్న గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతున్నాయి. అన్ని పరీక్షలకు బార్ కోడింగ్ విధానం అమలు చేస్తున్నందున దీని గురించి తెలుసుకునేందుకు విద్యార్థలు అర గంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు.

పరీక్ష రాస్తున్నవారిలో రెగ్యులర్ విద్యార్థులు 10.76 లక్షల మంది కాగా, ప్రైవేట్ విద్యార్థులు 2.87 లక్షల మంది ఉన్నారు. పరీక్షల్లో అక్రమాలను అరికట్టేందుకు 300 ఫ్లయింగ్ స్క్వాడ్ లను ఏర్పాటు చేసినట్లు అధికారులు చెప్పారు. పరీక్షల్లో ఇప్పటి వరకు ఏ విధమైన ఇబ్బందులు ఎదురైనట్లు వార్తలు రాలేదు. కాగా, మావోయిస్టుల బంద్ వల్ల విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో విద్యార్థులు కేంద్రాలకు చేరుకోవడానికి కాస్తా ఇబ్బంది పడ్డారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X