వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

17 జిల్లాలతో తెలంగాణ: నారగోని

By Santaram
|
Google Oneindia TeluguNews

Telangana
మంచిర్యాల: తెలంగాణ రాష్ట్రాన్ని 17 జిల్లాలతో ఏర్పాటు చేయాలని తెలంగాణ బీసీ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ కన్వీనర్‌ వీజీఆర్‌. నారగోని అన్నారు. ఈ మేరకు శ్రీకృష్ణ కమిటీని కలిసి నివేదిక ఇవ్వనున్నామని వెల్లడించారు. ఆయన మంచిర్యాల ప్రెస్‌క్లబ్‌ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆదిలాబాద్‌ జిల్లాను రెండుగా విభజించాలన్నారు. మరికొన్ని ప్రాంతాల్లోనూ కొత్త జిల్లాల ఏర్పాటును తాము స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 17 ఎంపీ స్థానాలను 25కు, 117 అసెంబ్లీ నియోజకవర్గాలను 150కి పెంచాలన్న అభిప్రాయాన్ని కూడా తాము కమిటీ దృష్టికి తీసుకెళ్తామన్నారు. తద్వారా పరిపాలన సౌలభ్యం ఏర్పడుతుందన్నారు.

ఉద్యమ తీరుతెన్నులపై నారగోని మాట్లాడుతూ ప్రస్తుతం రాజకీయ పార్టీలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. టీడీపీ గత ఎన్నికల సందర్భంలో తెలంగాణ అంశాన్ని మ్యానిఫెస్టోలో పెట్టి ఇప్పుడు మాట మార్చిన వైఖరిని ప్రజలు గమనిస్తున్నారన్నారు. జేఏసీ కన్వీనర్‌ కోదండరామ్‌ టీఆర్‌ఎస్‌ జేబు సంస్థగా పనిచేస్తున్నారని ధ్వజమెత్తారు. టీఆర్ ‌ఎస్‌ ఎమ్మెల్యేల విజయం కోసమే ఆయన పనిచేస్తున్నట్లు కనిపిస్తోందని విమర్శించారు. బీసీలకు ప్రాధాన్యం ఇవ్వకుండా ఉద్యమాన్ని నిర్వీర్యపరిచారని వాపోయారు. ముఖ్యమంత్రి రోశయ్య ఆంధ్ర పక్షపాతిగా వ్యవహరిస్తున్నారని, వెంటనే ఆయనను మార్చాలని డిమాండ్‌ చేశారు. రాజ్యాంగ సవరణ ద్వారా హైదరాబాద్‌ ఫ్రీజోన్‌ కాకుండా చూడాలన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X