హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ ఫ్యామిలీ దోచుకుంటోంది: నారాయణ

By Pratap
|
Google Oneindia TeluguNews

Narayana
హైదరాబాద్: రాష్ట్రంలోని మైనింగ్ సంపదనంతా దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబం దోచుకుంటోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ ఆరోపించారు. ఎక్కడ మైనింగ్ అక్రమాలు జరిగినా అక్కడ వైయస్ కుటుంబ సభ్యులు ఉంటున్నారని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. రాష్ట్రంలోని వందలాది ఎకరాల సాగు భూములను వైయస్ కుటుంబ సభ్యులు ఆక్రమించుకుంటున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్ర ఖనిజ సంపదనంతా మైనింగ్ మాఫియా దోచుకు తింటోందని ఆయన అన్నారు. భూగర్భ ఖనిజ సంపద ప్రభుత్వానికే చెందాలని, ప్రైవేట్ పరం కాదని ఆయన అన్నారు.

కర్నూలు జిల్లాలోని అవుకు భూములు, మైనింగ్ భూముల అన్యాక్రాంతంపై విచారణకు కమిటీ వేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మైనింగ్ అక్రమాలను చూస్తుంటే రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా, లేదా అనే అనుమానం కలుగుతోందని ఆయన వ్యాఖ్యానించారు. రైతుల భూములు వారికే తెలియకుండా అన్యాక్రాంతమవుతున్నాయని ఆయన అన్నారు. కర్నాటక మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఓబుళాపురం మైనింగ్ కంపెనీ అక్రమాలపై తాము ఎన్నో ఆందోళనలు చేశామని, సుప్రీంకోర్టు చెప్పిన తర్వాతనే ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X