వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

25 అడుగుల వైయస్ విగ్రహ నిర్మాణం

By Santaram
|
Google Oneindia TeluguNews

YS Rajasekhar Reddy
భీమవరం: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి భారీ విగ్రహాన్ని భీమవరం గునుపూడి-తాడేరు రోడ్డులో నిర్మిస్తున్నారు. 25 అడుగుల ఎత్తుగల విగ్రహాన్ని ఆరు లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేస్తున్నారు. స్థానికులు వైయస్పై అభిమానంతో జిల్లాలో అతి పెద్ద విగ్రహాన్ని నిర్మించాలనే ఆకాంక్షతో నిధులు విరివిగా సమకూర్చారు.

డీసీసీ అధ్యక్షుడు కొయ్యే మోషేన్‌ రాజు సోమవారం మాట్లాడుతూ వైయస్ జిల్లా ప్రజలకు చేసిన సేవలు మరువలేనివని, అందులో ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఆయన ఎంతో కృషి చేశారని అన్నారు. కోటి రూపాయల నిధులతో ఈ ప్రాంతంలో రోడ్లు వేయించిన ఘనత వైయస్దేనని చెప్పారు.

కడప ఎంపీ వైయస్ జగన్‌ మోహన్ ‌రెడ్డి జిల్లాలో పర్యటించే సందర్భంలో ఈ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని మోషేన్‌రాజు చెప్పారు. ఈ ప్రాంతప్రజల గుండెల్లో వైయస్ చిరస్థాయిగా నిలిచిపోతారని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X