హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రభుత్వానికి కాగ్ నివేదిక అక్షింతలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Assembly
హైదరాబాద్: ప్రభుత్వానికి పలు కార్యక్రమాల విషయంలో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక అక్షింతలు వేసింది. రేషన్ కార్డుల జారీ విధానాన్ని కాగ్ తప్పు పట్టింది. ఐరిష్ కార్డుల జారీ విధానం సరిగా లేదని అభిప్రాయపడింది. ఈ పథకం అమలుకు 106 కోట్ల రూపాయలు అనుచితంగా ఖర్చు చేశారని తప్పు పట్టింది. పత్రికా ప్రకటనలకు అదనంగా 34 కోట్ల రూపాయలు వెచ్చించారని అభిప్రాయపడింది. శాసనసభ బడ్జెట్ సమావేశాల చివరి రోజు మంగళవారం కాగ్ తన నివేదికను శాసనసభకు సమర్పించింది.

ఉపాధి హామీ పథకానికి సంబంధించి 38 కోట్ల రూపాయలు ఇతర పథకాలకు మళ్లించినట్లు కాగ్ అభిప్రాయపడింది. సాగునీటి ప్రాజెక్టుల నాణ్యత, నియంత్రం సరిగా లేదని, అనుభవం లేనివారికి కాంట్రాక్టులు అప్పగించారని విమర్శించింది. జలయజ్ఞం కింది సాగునీటి ప్రాజెక్టులకు భూసేకరణకు అధిక మొత్తం చెల్లింపులు జరిపారని తప్పు పట్టింది. ఐటి కంపెనీలకు 165 కోట్ల రూపాయలకు 50 ఎకరాల భూములను అప్పగించడాన్ని కూడా కాగ్ తప్పు పట్టింది. గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ పని తీరును కూడా కాగ్ తప్పు పట్టింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్థిక యాజమాన్యం లోపభూయిష్టంగా ఉందని అభిప్రాయపడింది. నియామకాల విధానాన్ని కూడా తప్పు పట్టింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X