అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పరీక్ష హాలులో టీచర్ బూతు పనులు

By Santaram
|
Google Oneindia TeluguNews

Anantapur
అనంతపురం: రాజేంద్ర నగర్ ఉన్నత పాఠశాలలో లెక్కల మాస్టర్‌గా పనిచేస్తున్న మహేష్‌ అదే స్కూలులో పదవతరగతి పబ్లిక్‌ పరీక్షలకు ఇన్విజిలేటర్‌ నియమితులయ్యాడు. సోమవారం జరిగిన పరీక్షకు ఇన్విజిలేషన్‌ విధులు చేపట్టాడు. పరీక్ష రాస్తున్న ఓ విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. పదే పదే ఆ బాలిక వద్దకు వెళ్లడం, ఏదో ఒక సాకుతో తాకడం వంటి విపరీతమైన చేష్టలతో వేధించాడు. అప్పటిదాకా సహనంగా పరీక్ష రాసిన బాధిత విద్యార్థిని, పరీక్ష ముగిసిన తరువాత కంటతడిపెట్టుకుని లెక్కల మాస్టారి లైంగిక వేధింపుల విషయం తల్లిదండ్రులకు చెప్పింది. తమను కూడా ఆ మాస్టర్‌ వేధించాడని మరికొంత మంది విద్యార్థినులు వాపోయారు.

ఐదుగురు బాధిత విద్యార్థినులు తమ తల్లిదండ్రులతో కలిసి నేరుగా వన్‌ టౌన్‌ పోలీసు స్టేషన్‌ లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు లెక్కల మాస్టర్‌ మహేష్‌ ను అరెస్టు చేయడానికి పరీక్షా కేంద్రం వద్దకు వెళ్లారు. కానీ అతను పోలీసులకు సహకరించకపోగా వారితో వాగ్వాదానికి దిగాడు. పోలీసుస్టేషన్‌కు వెళ్లడానికి మొరాయించాడు. చివరకు ఎస్‌ఐ రమణ వచ్చి లెక్కల మాస్టర్‌ ను అరెస్టు చేసి స్టేషన్‌కు తీసుకెళ్లారు. 354 సెక్షన్‌ కింద మాస్టర్‌ పై కేసు నమోదు చేసినట్లు సీఐ రాఘవరెడ్డి వెల్లడించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X