నేదురుమల్లిపై సిఎంకు సోదరుడి ఫిర్యాదు

Nedurumalli Janardhan Reddy
హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెసు సీనియర్ నేత నేదరుమల్లి జనార్దన్ రెడ్డిపై ఆయన సోదరుడు పద్మనాభ రెడ్డి మంగళవారం ముఖ్యమంత్రి కె. రోశయ్యకు ఫిర్యాదు చేశారు. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి కూడా ఫిర్యాదు చేస్తానని ఆయన మీడియా ప్రతినిధులతో చెప్పారు. తనకు నేదరుమల్లి నుంచి ప్రాణహాని ఉందని, తనకు రక్షణ కల్పించాలని ఆయన ముఖ్యమంత్రిని కోరారు. కాంగ్రెసు అభ్యర్థి పనబాక కృష్ణయ్యకు వ్యతిరేకంగా 2009 ఎన్నికల్లో తాను పనిచేయడానికి అంగీకరించకపోవడం వల్లనే తనపై నేదురుమల్లి కక్ష గట్టారని, తన విద్యాసంస్థలపై దాడులు చేయిస్తున్నారని ఆయన ఆరోపించారు.

తాను నేదరుమల్లి ఇంటి ముందు ఆమరణ నిరాహారదీక్ష చేస్తానని, లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని ఆయన అన్నారు. నేదురుమల్లిపై తీవ్ర ఆరోపణలు కూడా చేశారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెసుకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి పని చేశారని ఆయన విమర్శించారు. పనబాక కృష్ణయ్యను పని కట్టుకుని ఓడించారని ఆయన ఆరోపించారు. నేదురుమల్లి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం వల్ల నెల్లూరు జిల్లాలో మూడు స్థానాల్లో కాంగ్రెసు అభ్యర్థులు ఓడిపోయారని ఆయన అన్నారు. నేదరుమల్లి కాంగ్రెసుకు ద్రోహం చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+