అల్లర్లను ఉక్కుపాదంతో అణచేస్తాం: సిఎం

Rosaiah
హైదరాబాద్: హైదరాబాదులోని పాతబస్తీ అల్లర్లను ఉక్కుపాదంతో అణచేస్తామని ముఖ్యమంత్రి కె. రోశయ్య చెప్పారు. పాతబస్తీ అల్లర్లపై తక్షణమే శాసనసభలో చర్చ జరగాలని తెలుగుదేశం పార్టీ పట్టుబట్టింది. ఈ సమయంలో మంగళవారం రోశయ్య ఆ విషయం చెప్పారు. పాతబస్తీ అల్లర్లపై ఉదయం 11 గంటలకు అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు కూడా ఆయన తెలిపారు. పాతబస్తీ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని ఆయన చెప్పారు. అల్లర్లకు కారకులు ఎంతటివారైన కఠినంగా శిక్షిస్తామని ఆయన చెప్పారు. పరిస్థితిని అదుపు చేయడానికి అందరి సహకారం కావాలని ఆయన అన్నారు. విచ్ఛిన్నకర శక్తుల అణచివేతకు కూడా అన్ని రాజకీయ పార్టీల సహకారం కావాలని ఆయన అన్నారు.

మంగళవారం శాసనసభ సమావేశాలు ప్రారంభ కాగానే తెలుగుదేశం, ఇతర ప్రతిపక్షాలు పాతబస్తీ అల్లర్లపై చర్చకు పట్టుబట్టాయి. అల్లర్ల వెనక రాజకీయ కుట్ర ఉందని అంటున్నారని, దాన్ని బహిర్గతం చేయాలని తెలుగుదేశం సభ్యుడు నాగం జనార్దన్ రెడ్డి అన్నారు. ఈ సమయంలో హైదరాబాదుకు చెందిన రాష్ట్ర ఆరోగ్య మంత్రి దానం నాగేందర్ కల్పించుకుని - సున్నితమైన అంశాన్ని రాజకీయం చేయవద్దని, పరిస్థితిని అదుపులోకి తేవడానికి ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని చెప్పారు. పరిస్థితిపై చర్చించడానికి అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అయినా తెలుగుదేశం సభ్యులు వినలేదు. సబా కార్యక్రమాలను స్తంభింపజేశారు. దీంతో స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+