వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జవాన్లు మావోల ట్రాప్ లో పడ్డారు: చిదంబరం

By Pratap
|
Google Oneindia TeluguNews

Chidambaram
న్యూఢిల్లీ: సిఆర్పీఎఫ్ జవాన్లు మావోయిస్టుల ట్రాప్ లో పడ్డారని కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం అన్నారు. చత్తీస్ ఘడ్ లో జరిగిన ఘటనపై ఆయన మంగళవారం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాయి. ప్రాణ నష్టం భారీగా జరిగిందని ఆయన వ్యాఖ్యానించారు. ఏదో తప్పు జరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ఘటన సిపిఐ - మావోయిస్టు కిరాతక స్వభావాన్ని తెలియజేస్తోందని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి వెళ్లారని, నివేదిక కోసం తాను ఎదురు చూస్తున్నానని ఆయన అన్నారు.

నక్సలైట్ల దాడిలో చాలా మంది తీవ్రంగా గాయపడ్డారని, వారిని హెలికాప్టర్లలో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తున్నామని చత్తీస్ ఘడ్ డిజిపి విశ్వరంజన్ తెలిపారు. పథకం ప్రకారమే మావోయిస్టులు దాడి చేశారని ఆయన అన్నారు. కాగా, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర రెడ్ అలర్ట్ ప్రకటించింది. మావోయిస్టుల దాడిలో 70 మంది జవాన్లు మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండవచ్చునని అనుమానిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X