నక్సల్స్ దాడి: 73 మంది జవాన్ల మృతి
ఘటన జరిగిన ప్రదేశంలో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. దాదాపు వేయి మంది నక్సలైట్లు ఈ చర్యకు దిగినట్లు సమాచారం. గ్రీన్ హంట్ కు వ్యతిరేకంగా మావోయిస్టులు ఈ చర్యకు పూనుకున్నట్లు సమాచారం. మృతదేహాలను తరలించడానికి హెలికాప్టర్ ను వాడుతున్నట్లు పోలీసు డైరెక్టర్ జనరల్ విశ్వరంజన్ చెప్పారు. సంఘటన జరిగిన ప్రదేశం ఆంధ్ర సరిహద్దుకు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. గాయపడిన జవాన్లలో 8 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. మావోయిస్టుల చేతిలో కొంత మంది జవాన్లు బందీలుగా ఉన్నట్లు కూడా తెలుస్తోంది. దాదాపు 200 మంది దాకా మావోయిస్టుల చేతిలో బందీగా ఉండవచ్చునని అనుమానిస్తున్నారు.
సంఘటనా స్థలానికి అదనపు బలగాలు చేరుకుంటున్నాయి. ఉన్నతాధికారులు కూడా ఆ ప్రాంతానికి బయలుదేరారు. ప్రాణ నష్టం భారీగా జరిగిందని, తాను దిగ్భ్రాంతి చెందానని కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి తగిన సహాయం అందిస్తామని ఆయన చెప్పారు.