హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ సీన్ వద్దు: మీడియాతో సర్వే

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కు మీడియా ప్రాముఖ్యం ఇవ్వడంపై ఆ పార్టీ పార్లమెంటు సభ్యుడు సర్వే సత్యనారాయణ మీడియాపై రుసరుసలాడారు. జగన్ పేరు తప్ప మీడియాకు మరోటి పట్టదా అని ఆయన అడిగారు. జగన్ కూడా తమ లాగా ఒక సాధారణ పార్లమెంటు సభ్యుడేనని, ముఖ్యమంత్రి రోశయ్యతో జగన్ భేటీకి అంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదనే పద్ధతిలో ఆయన మాట్లాడారు. జగన్ చుట్టూ వార్తలు రాయడం తప్ప మీడియాకు మరో పని లేదా అని ఆయన అడిగారు.

తాను రాష్ట్ర పర్యటన చేస్తానని, ఎవరైనా పర్యటనలు చేయవచ్చునని, పార్టీని పటిష్టం చేయడానికి ఎవరైనా ఆ పని చేయవచ్చునని ఆయన అన్నాడు. దమ్ము, సత్తా ఉంటే జగన్ పర్యటిస్తాడని, ప్రజలు దీవిస్తే ముందుకు సాగుతాడని, అందువల్ల జగన్ ఓదార్పు యాత్రకు అంత సీన్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి కుమారుడు కాబట్టి జగన్ ను గౌరవిస్తారని, పార్లమెంటు సభ్యుడు కాబట్టి మర్యాద ఇస్తామని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X