కుంటిసాకులతో ఉద్యమాలు వద్దు: సిఎం

రాజకీయాలలో ఎవరికైనా సీఎం కావాలన్న ఆశ ఉంటుందని, ఆ పదవి వస్తే ఎవరికైనా ఆనందమేనని, కానీ రాష్ట్రం మొత్తం విషాదంలో ఉన్నపుడు రోశయ్యకు సీఎం పదవి అప్పజెప్పారని రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఈ అంశాన్ని రోశయ్య ప్రస్తావిస్తూ - తాను సీఎం కావాలని ఎప్పుడూ కోరుకోలేదని, ఈ పదవిని సంతోషంగా స్వీకరించలేదని అధిష్ఠానం తనకు అప్పగించిన పదవిని గురుతర బాధ్యతగానే ఇప్పటికీ భావిస్తున్నానని అన్నారు. వైయస్ అకాల మరణం కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలతోపాటు తనకూ హృదయ వేదన కలిగిస్తోందన్నారు. రోశయ్య ప్రసంగిస్తుండగా కొంతమంది డీఎస్సీ ఉద్యోగాలు భర్తీ చేయాలని బ్యానర్లు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. కావాలనే సభలో గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇది సబ బు కాదని రోశయ్య హితవు పలికారు. ఏదైనా ఉంటే తన వద్దకు వస్తే మాట్లాడుతానని సూచించారు. ఈ సభలో రోశయ్యను జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున స్వర్ణ కిరీటంతో సన్మానించారు.












Click it and Unblock the Notifications