వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్ కు వికె దుగ్గల్ ఆహ్వానం

By Pratap
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
న్యూఢిల్లీ: సంప్రదింపుల కోసం జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ సభ్య కార్యదర్శి వికె దుగ్గల్ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె చంద్రశేఖర రావును ఆహ్వానించారు. ఈ మేరకు దుగ్గల్ కెసిఆర్ కు సోమవారం ఓ లేఖ రాశారు. దాంతో కెసిఆర్ ఈ నెల 13వ తేదీన ఢిల్లీ వస్తున్నారు. ఆయన ఈ నెల 16వ తేదీన శ్రీకృష్ణ కమిటీ సభ్యులతో సమావేశమవుతారు. ఆయన ఉదయం 11 గంటలకు వారితో సమావేశమవుతారు. సంప్రదింపులు రెండు గంటల పాటు సాగుతాయి.

రాష్ట్ర పరిస్థితిపై ఏర్పడిన జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ ఈ నెల 16వ తేదీ నుంచి రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరుపుతుంది. ఇందులో భాగంగా తొలుత తెరాస అధ్యక్షుడు కెసిఆర్ ను చర్చలకు ఆహ్వానించారు. వరుసగా ఇతర రాజకీయ పార్టీలతో చర్చలు జరుపుతారు. కాగా, ఈ నెల 22, 23 తేదీల్లో శ్రీకృష్ణ కమిటీ సభ్యులు హైదరాబాద్ వెళ్తారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X