తెలుగుదేశంలోకి మళ్ళీ జయప్రద

Jayaprada
హైదరాబాద్: సినీనటి జయప్రద తెలుగుదేశం పార్టీ ప్రవేశానికి పావులు కదులుతున్నాయి. గతంలో తెలుగు మహిళ అధ్యక్షురాలిగా పనిచేసినజయప్రద తిరిగి సొంత గూటికి చేరడానికి రంగం దాదాపు సిద్ధమైనట్లు తెలిసింది. ఈ మేరకు కొందరు తెలుగుదేశం నాయకులు రాయబారం నడుపుతున్నారు. జయప్రదను పార్టీలో చేర్చుకోవడానికి పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. సుమారు ఎనిమిదేళ్ల కిందట ఆమె టీడీపీని విడిచిపెట్టి ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లోకి ప్రవేశించి అక్కడి సమాజ్ ‌వాదీ పార్టీలో చేరారు. ప్రస్తుతం ఆ పార్టీ తరఫున ఆమె లోక్‌సభ సభ్యురాలిగా ఉన్నారు. ఇటీవల ఆ పార్టీ నుంచి అమర్‌సింగ్‌తోపాటు జయప్రద కూడా బహిష్కరణకు గురయ్యారు. దీంతో ఆమె మళ్లీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై దృష్టిసారించారు. ఇటీవల తిరుపతి వచ్చిన జయప్రద - రాష్ట్ర రాజకీయాల్లోకి తిరిగి రావాలన్న కోరికను వ్యక్తం చేశారు.

మళ్లీ పార్టీలోకి రావడానికి జయప్రద సంసిద్ధత వ్యక్తం చేసినట్లు తెలిసింది. అయితే పార్టీలో తనకు లభించే ప్రాధాన్యంపై సందేహాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. పార్టీలోకి వస్తే సముచిత ప్రాధాన్యమే లభిస్తుందని రాయబారం జరుపుతున్న నేతలు ఆమెకు హామీ ఇచ్చినట్టు చెబుతున్నారు. అయితే, తనతోపాటు బహిష్కరణకు గురైన అమర్‌సింగ్‌తో కూడా చర్చించి త్వరలోనే తన నిర్ణయాన్ని తెలియజేస్తానని జయప్రద చెప్పినట్టు తెలిసింది. రోజా పార్టీ నుంచి పార్టీ నుంచి వెళ్లిపోవడంతో జయప్రద తిరిగి పార్టీలో చేరితే ఆమెకు తెలుగు మహిళ అధ్యక్ష పదవి దక్కే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+