ఆదిలాబాద్: తెలంగాణ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు, సమస్యలకు గురవుతుంటే కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ఓదార్పు యాత్ర తెలంగాణలో ఎందుకని తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ (జెఎసి) కన్వీనర్ కోదండరామ్ ప్రశ్నించారు. తెలంగాణలో ప్రజలు విద్యుత్ కోతతో సతమతమవుతున్నారని, బలవన్మరాలు తెలంగాణ సంభవిస్తున్నాయని అంటూ వారికి ఎమిచ్చిన జగన్ ఓదారుస్తారని ఆయన అడిగారు. తెలంగాణ ప్రజలు ఎదుర్కుంటున్న ఇతర సమస్యలను కూడా ఆయన తెలిపారు.
ప్రశ్నించడానికి పూనుకున్న తెలంగాణ ప్రజలను ముందుగానే అరెస్టు చేసిన తర్వాత వైయస్ జగన్ తెలంగాణలో యాత్ర చేస్తే ప్రయోజనం ఏమిటని ఆయన అడిగారు. జగన్ యాత్రపై ఆయన తీవ్రంగా విమర్శలు గుప్పించారు.