ధరలపై జాతీయ స్థాయి ఆందోళన: బాబు

Chandrababu Naidu
న్యూఢిల్లీ: నిత్యావసర ధరల పెరుగుదలకు నిరసనగా జాతీయ స్థాయి ఆందోళన చేపట్టనున్నట్లు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. ఆందోళన కార్యాక్రమ కార్యాచరణను రూపొందించేందుకు జరిగే సమావేశంలో పాల్గొనడానికి ఆయన ఢిల్లీ చేరుకున్నారు. బిజెపియేతర పార్టీలతో కలిసి జాతీయ స్థాయి ఆందోళన చేపట్టనున్నట్లు ఆయన మీడియా ప్రతినిధులతో చెప్పారు.

ధరల పెరుగుదలను అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు. ధరల పెరుగుదల వల్ల సామాన్యుడి జీవితం కష్టాల్లో పడిందని ఆయన అన్నారు. వ్యవసాయ రంగం విషయంలో కూడా ప్రభుత్వం విఫలమైందని ఆయన అన్నారు. ఆహార భద్రత లేకుండా పోయిందని ఆయన అన్నారు. సోమవారం సాయంత్రం ఢిల్లీలో 11 పార్టీలతో జరిగే సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఈ సమావేశంలో ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా జాతీయ స్థాయి ఆందోళనను రూపొందిస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+